మొబైల్ తయారీ రంగంలో సంచలనం సృష్టిస్తున్న రెడ్మీ ..తాజాగా స్మార్ట్ టీవీ రంగంలోకి వచ్చింది. తాజాగా రెడ్మీ బ్రాండ్ కింద ‘రెడ్మీ టీవీ 70-ఇంచ్’ పేరిట తొలి స్మార్ట్టీవీని బీజింగ్లో విడుదల చేసింది. 70 అంగుళాల తెరతో ఈ టీవీ ని మార్కెట్లోకి తీసుకరావడం విశేషం. సెప్టెంబరు 3 నుంచి చైనాలో రెడ్మీ టీవీ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. దీని ధర 3,799 చైనీస్ యువాన్లుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 38 వేలు అన్నమాట. అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పుడు విడుదల చేస్తారన్నదానిపై షామీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఈ టీవీ ఫీచర్లు చూస్తే..
* 4కే రెజల్యూషన్ స్క్రీన్
* హెచ్డీఆర్ సపోర్ట్, క్వాడ్కోర్ ప్రాసెసర్
* 2జీ ర్యామ్, 16జీబీ అంతర్గత సామర్థ్యం
* డాల్బీ ఆడియో, డీటీఎస్ హెచ్డీ లాంటి ఆడియో టెక్నాలజీస్