ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ ను అందించే శాంసంగ్ ..తాజాగా ‘గెలాక్సీ ఏ70 ఎస్’ పేరిట సరికొత్త ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 64 మెగా పిక్సెల్ భారీ కెమెరా కలిగివుండటం ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ ధర విషయానికి వస్తే..6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 28,999 గా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర : 30,999 గా నిర్ణయించారు.
ఫీచర్ల విషయానికి వస్తే..
* 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ, ఇన్ఫినిటీ, యూ-డిస్ప్లే
* క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ఆక్టాకోర్ ప్రాసెసర్
* యూఐ ఆధారిత ఆండ్రాయిడ్ 9 పైయి
* 64+8+5 ఎంపీ ట్రిపుల్ కెమెరా
* 32 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా
* 4500 ఎంఏహెచ్ బ్యాటరీ.