భారత్ లో మల్టీస్ట్రాడా 1260 పైక్స్‌ పీక్‌..

స్టైలిష్ బైక్స్ కు పెట్టింది పేరు డుకాటీ..ఇటలీ కి చెందిన ఈ సంస్థ నుండి ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ వచ్చి వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మల్టీస్ట్రాడా 1260 పైక్స్‌ పీక్‌ పేరిట సరికొత్త మోడల్ భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.21.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు.

ఈ బైక్స్ భారత్‌లో పరిమిత సంఖ్యలోనే లభిస్తాయని సంస్థ తెలిపింది. 1262 సీసీ సామర్థ్యంతో కొత్త చాసిస్‌, యూరో 4 నిబంధనలకు అనుగుణమైన ఇంజిన్‌ను పైక్స్‌ పీక్‌ వేరియంట్‌లో అమర్చినట్లు పేర్కొన్నారు.

ఈ బైక్ ప్రత్యేకల విషయానికి వస్తే..

* కొత్త ఫ్రంట్‌ ఎండ్‌ జియోమెట్రీ

* పొడవైన్‌ స్విన్‌గార్మ్‌ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నట్లు సమాచారం. భారత వాహనదారులు కోరుకునే విధంగా కొత్త బైకులు తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని, అందులో భాగంగానే మల్టీస్ట్రాడా 1260 పైక్స్‌ పీక్‌ మోడల్‌ను తీసుకొచ్చామని డుకాటీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సెర్గీ కనోవాస్‌ మీడియా కు తెలిపారు.