ఎయిర్‌టెల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌..

ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్న ఎయిర్‌టెల్ ..తాజాగా మరో నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.419 తో రీచార్జి చేసుకుంటే రోజుకు 1.4 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయని తెలిపింది.

ఈ ప్లాన్ వాలిడిటీని 75 రోజులుగా సంస్థ నిర్ణయించింది. అలాగే రూ.97 కి మరో నూతన రీచార్జి ప్యాక్‌ను కూడా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌లో కస్టమర్లకు 350 నిమిషాల లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ తోపాటు 200 ఎస్‌ఎంఎస్‌లు, 1.5 జీబీ డేటా వస్తాయని ప్రకటించింది.