ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్న ఎయిర్టెల్ ..తాజాగా మరో నూతన ప్రీపెయిడ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.419 తో రీచార్జి చేసుకుంటే రోజుకు 1.4 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయని తెలిపింది.
ఈ ప్లాన్ వాలిడిటీని 75 రోజులుగా సంస్థ నిర్ణయించింది. అలాగే రూ.97 కి మరో నూతన రీచార్జి ప్యాక్ను కూడా ఎయిర్టెల్ ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్లో కస్టమర్లకు 350 నిమిషాల లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ తోపాటు 200 ఎస్ఎంఎస్లు, 1.5 జీబీ డేటా వస్తాయని ప్రకటించింది.