ఇండియన్ మార్కెట్ లోకి అసుస్ రోగ్


అసుస్ తన కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రోగ్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ కేవలం బ్లాక్ కలర్ వేరియెంట్‌లో మాత్రమే విడుదల కాగా రూ.69,999 ధరకు దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. ఈ ఫోన్‌పై 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంది.

అసుస్ రోగ్ ఫోన్ ఫీచర్లు…

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్,
2.96 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్,
8 జీబీ ర్యామ్, 128/512 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్,
12, 4 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్, రెసిస్టెంట్ బాడీ,
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై,
బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.