మెయ్జు తన కొత్త స్మార్ట్ఫోన్ నోట్ 9 ను తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.2 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్లను ఇందులో అమర్చారు. అందువల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు.
మెయ్జు నోట్ 9 స్మార్ట్ ఫోన్ బ్లాక్, వైట్, స్పార్క్లింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ఫోన్కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.14,700 ధరకు లభ్యం కానుంది. అలాగే 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ లేదా 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లు రూ.16,800 ధరకు లభ్యం కానున్నాయి.