ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మెయ్జు..తాజాగా మెయ్జు ఎక్స్8 పేరిట సరికొత్త స్మార్ట్ఫోన్ను ఈరోజు చైనా మార్కెట్లో విడుదల చేసింది. అతి త్వరలోనే భారత్ మార్కెట్లోకి ఈ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభ్యం కానుంది.
4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,985 ధరకు లభ్యం కానుండగా, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.19,110 ధరకు, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.21,240 ధరకు లభ్యం కానుంది.
ఇక ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే…
* 6.2 ఇంచుల భారీ డిస్ప్లే
* వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు
* ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరా
* ఏఐ ఫేస్ అన్లాక్ సదుపాయం
* ఫోన్ వెనుక బ్యాక్ ప్యానెల్ను గ్లాస్ బ్యాక్ డిజైన్తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది.
* 2220 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్
* 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
* యూఎస్బీ టైప్ సి, 3210 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.