భారత మార్కెట్లోకి శాంసంగ్‌ సరికొత్త మోడల్స్ ..

ప్రముఖ మొబైల్ సంస్థ శాంసంగ్‌ తాజాగా భారత మార్కెట్లోకి గెలాక్సీ వెర్షన్‌లో ఎస్‌10, ఎస్‌10 ప్లస్‌, ఎస్‌10ఈ మోడల్స్ ను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ. 55,900గా నిర్ణయించింది. గెలాక్సీ ఎస్‌10 ప్లస్‌ మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు.

* 1 టీబీ వేరియంట్‌ ధర రూ. 1,17,900, 512 జీబీ వేరియంట్‌ ధర రూ. 91,900
* 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 73,900గా
* గెలాక్సీ ఎస్‌10 (512 జీబీ) ధర రూ. 84,900
* 128 జీబీ వేరియంట్‌ ధర రూ.66,900గా నిర్ణయించింది.
* గెలాక్సీ ఎస్‌10ఈ కేవలం 128 జీబీ వేరియంట్‌ రూ. 55,900గా ఉంది.