ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతి ఏడూలాగానే ఈ ఏడూ కూడా ప్రైమ్ డే సేల్ ను తీసుకొచ్చింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు ఇది కొనసాగుతుంది. అంటే 36 గంటలపాటు ఈ ప్రైమ్డే సేల్ కొనసాగబోతుంది. దీనికి పోటీగా ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించింది.
ఈనెల 19 వరకు అంటే నాలుగు రోజులపాటు ఈ సేల్ కొనసాగనుంది. సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు, ఇతర గాడ్జెట్లపై భారీ రాయితీలు ప్రకటించింది. శాంసంగ్, గూగుల్, వివో ఇతర బ్రాండ్లపై బ్రహ్మాండమైన ఆఫర్లు ఉన్నాయి. అన్నింటికంటే గూగుల్ పిక్సెల్2 (128) జీబీ వేరియంట్ను ఇప్పుడు రూ.42,999కే అందిస్తోంది. సేల్ జరిగే నాలుగు రోజులూ ఎక్స్చేంజ్ ఆఫర్లు, బైబ్యాక్ గ్యారెంటీలను అందిస్తోంది.
దీంతో పాటు ‘బ్లాక్బస్టర్ డీల్స్’, ‘రష్ అవర్ డీల్స్’, ‘ఫస్ట్ టైం డిస్కౌంట్లు, ‘ప్రైస్ క్రాష్’ ఆఫర్లు కూడా ఉన్నాయి. రష్ అవర్ డీల్ను సాయంత్రం 4 నుంచి 6 మధ్య నాలుగు రోజులూ నిర్వహించనుంది.