బాబుకి బిజెపి థాంక్స్ చెప్పాలి !

భారతీయ జనతా పార్టీ కి తెలుగుదేశం అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మేలు చేస్తున్నాడా..? అసలు ఏపీ ప్రజల్లో బీజీపీ పార్టీ ఫై నమ్మకం లేదు అనుకునే టైములో వారిలో నమ్మకం నింపుతున్నాడా..? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజీపీ పార్టీ ఇక లేదు అనే ఊహాగానాలకు చెక్ పెడుతున్నాడా..? బాబు నిర్ణయాల వల్ల బీజీపీ పార్టీ నేతలు సంతోషం లో ఉన్నారా..? ఇప్పుడు ఈ ప్రశ్నలే తెలుగుదేశం కార్య కర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో మోడీ ప్రభుత్వం మోసం చేసిందని చెపుతూనే బీజీపీ పార్టీ కి మేలు చేస్తున్నాడు చంద్రబాబు. అది ఎలాగో తాజాగా జరిగిన మోడీ సభ ద్వారా బయటపడింది. గుంటూరు లో మోడీ సభ నిర్వహించబోతున్నాడనే ప్రకటన బయటకు వచ్చిన దగ్గరి నుండి ఈ సభ ను అడ్డుకోవాలని బాబు టీం తెగ కష్టపడింది. ఎక్కడెక్కడ ఏం చేయాలో అన్ని చేసింది..కానీ మోడీ సభ మాత్రం అనుకున్నదానికంటే ఎక్కువ సక్సెస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆ పార్టీ నేతలు బాబు కు థాంక్స్ చెపుతున్నారు.

మోడీ సభకు వెళ్ళకూడదు.. వాహనాలు తరలించకూడదు..ప్రజలు ఎట్టి పరిస్థితులో ఈ సభ కు వెళ్ళకూడదు..మోడీ ని ఆంధ్రప్రదేశ్ రాష్టంలోకి అడుగు పెట్టనివ్వకూడదని బాబు పదే పదే చెప్పడం వల్ల ప్రజల్లో మరో సంకేతం వెళ్ళింది..అసలు మోడీ సభకు వెళ్తే ఏమవుతుంది అనే ప్రశ్న వారిలో ఏర్పడింది. అంతే ఒక్కసారిగా వారిలో ఉత్సహం కట్టలు తెచ్చుకుంది..5 వేలు వస్తే గొప్ప అనుకున్న వారికీ ఏకంగా 25 వేలకు పైగా జనాలు హాజరై అందరికి షాక్ ఇచ్చారు. అంతే కాదు బీజీపీ నేతల్లోకూడా ఈ సభ ఇంత సక్సెస్ అవుతుందని ఉహించలేదట..రేపు సభ అన్నప్పుడు కూడా జనసమీకరణ జరగలేదట..అలాంటిది బాబు పదే పదే చెప్పడం , తెలుగు దేశం పార్టీ నేతల హడావిడి మూలంగా సభకు భారీగా ప్రజలు హాజరై విజయవంతం చేసారని వారంత చెప్పుకుంటూ బాబు కు థాంక్స్ చెపుతున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.