30 నుండి 35 సీట్ల‌తో జ‌న‌సేన దెబ్బ‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11 న సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయినా సంగతి తెలిసందే. ఈ పోలింగ్ సరళి ఫై అన్ని పార్టీ లు సమీక్షలు జరిపారు. తాజాగా చంద్రబాబు ఆయా నియోజకవర్గ అభ్యర్థులతో జరిపిన సమీక్షలో జనసేన పార్టీ వల్ల 30 నుండి 35 సీట్లు కోల్పోతున్నామని తెలియజేశారట.

తూర్పు గోదావరి నుండి 10 ..పశ్చిమ గోదావరి నుండి 10 ..శ్రీకాకుళం నుండి 10 ..వైజాగ్ ప్రాంతంలో మరో 5 సీట్లు కోల్పోబోతున్నట్లు చంద్రబాబు కు తెలియజేశారట. దీనిపై బాబు కూడా అవుననే సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో బీజీపీ , జనసేన , తెలుగు దేశం మూడు పార్టీ లు కలవడం వల్ల ఆ ఓట్లు టీడీపీ కి పడ్డాయని..ఈసారి ఎవరికీ వారే బరిలో దిగడం తో జనసేన ఓట్లు జనసేనకు పడ్డాయని..అలాగే బీజీపీ ఓట్లు కూడా జనసేన కే పడ్డాయని మాట్లాడుకున్నారట.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.