చంద్రబాబు ఫై మోడీ వ్యంగ్యాస్త్రాలు

తాజాగా గుంటూరు లో జరిగిన సభ లో ప్రధాని మోదీ చంద్రబాబు ఫై ఓ రేంజ్ లో వ్యంగ్యాస్త్రాలు చేసారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను చేపట్టిన పథకాలపై.. చంద్రబాబు తన స్టిక్కర్‌ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. పోలవరం నుంచి అమరావతి వరకు అన్నిటిలోనూ అనేక అక్రమాలతో చంద్రబాబు తన సంపదను పెంచుకున్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమాల్లో చంద్రబాబు సీనియర్‌ అని మండిపడ్డారు.

చంద్రబాబు సీనియార్టీ దేనిలో ఉందో వివరించాడు..

* అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి సారి పార్టీ మారే సీనియార్టీ నాకు లేదు..

* గెలిచినా తర్వాత ఓడిపోయే సీనియార్టీ నాకు లేదు..

* అన్ని గ్రూపుల్లో చేరే సీనియార్టీ నాకు లేదు అంటూ మోదీ బాబు సీనియార్టీ ఫై విరుచుకపడ్డాడు.

ఇన్నాళ్లూ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిన వారు ఇప్పుడు అసత్య ప్రచారం ద్వారా పబ్బం గడుపుకుందామనుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఏపీ అభివృద్ధిని వదిలేసి నన్ను తిట్టే పని పెట్టుకున్నారని విమర్శించారు. ఏపీ మౌలిక వసతులను గొప్పగా మారుస్తామని వాగ్దానం చేసిన బాబు వాటన్నిటినీ వదిలేసి యూటర్న్‌ తీసుకున్నారని మండిపడ్డారు. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారని, చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణమని ఎద్దేవా చేశారు.