కేసీఆర్ క్యాన్సిల్ మోడీ స‌క్సెస్‌

శాసన సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యధిక స్థానాల్లో తెరాస గెలిచి కేసీఆర్ తన ఉనికిని చాటుకున్నాడు. తెలుగుదేశం పార్టీ..కాంగ్రెస్ పార్టీ లు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డ గాని జనాలు మాత్రం కేసీఆర్కె పట్టం కట్టారు. దీంతో తెలంగాణ రాష్ట్రం లో తెరాస పార్టీ కి తిరుగులేదని..ఏ ఎన్నికలు జరిగిన తెరాసదే విజయమని అంత భావించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మ్మెల్సీ ఎన్నికల్లో తెరాస కు గట్టి షాకే తగిలింది.

ఇక లోక్ సభ ఎన్నికల మరో వారం రోజుల్లో జరగబోతున్నాయి. 16 స్థానాల్లో గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో తెరాస భారీ సభ ఫెయిల్యూర్ అయ్యింది. తెరాస పార్టీ నిర్వహించిన సభకు భారీ సంఖ్యలో జనాలు రాకపోవడంతో కెసిఆర్ సభకు హాజరు కాలేదు. దీంతో ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది . కానీ రెండు రోజుల క్రితం అదే ఎల్బీ స్టేడియంలో మోడీ నిర్వహించిన సభ భారీ సక్సెస్ కావడం తో అంత షాక్ అయ్యారు. మోడీ సభ గ్రాండ్ సక్సెస్ కావడం తో బీజీపీ నేతల్లో ఉత్సహం పెరిగింది. మళ్లీ తెలంగాణ లో బీజీపీ కి మంచి రోజులు రాబోతున్నాయని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.