శ్రీనివాస్ పరిస్థితి ఇక అంతేనా ?

ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. చుట్టూ పెద్ద ఎత్తున భద్రతా సిబ్బంది.. పార్టీ నేతలు.. ఫాలోయర్స్ లాంటి వాళ్లు ఉన్నప్పటికీ శ్రీనివాస్ అనే యువకుడు కోడి పందెల్లో ఉపయోగించే కత్తి తో దాడి చేసాడు. ఈ దాడి చేయడానికి కారణం ఏంటి..? ఈ దాడి చేయమని చెప్పిందెవరు..? ఈ దాడి ప్లాన్ ఎవరిదీ..? జగన్ ఫై దాడి వెనుక ఎవరి హస్తం ఉందనేది..పక్కన పెడితే..

ప్రస్తుతం దాడి చేసిన శ్రీనివాస్ మాత్రం అయోమయం లో పడిపోయాడు. ప్రస్తుతం ఈ కేసుకు సంబందించిన విచారం జరుగుతుంది. అయితే ఎవరైనా తన క్లయింట్ ను కేసు నుండి తప్పించడానికి..లేదా అతడికి బెయిల్ వచ్చేలా చూడడమే..కేసు నుండి బయట పడేలా చేయడమో చేస్తారు కానీ శ్రీనివాస్ లాయర్ మాత్రం శ్రీనివాస్ కు బెయిల్ రాకుండా అడ్డుకోవడం చర్చ గా మారింది. ఈ లాయర్ ఎవరో కాదు తెలుగు దేశం మనిషి. ఆ మనిషి కావాలని శ్రీనివాస్ కేసు తీసుకోవడం..ఇప్పుడు శ్రీనివాస్ కు బెయిల్ రాకుండా అడ్డుకోవడం ఇవన్నీ చూస్తుంటే ఈ దాడి వెనుక అసలు కారకులెవరో యిట్టె అర్థమైపోతుంది. మొత్తం మీద శ్రీనివాస్ పరిస్థితి చూసిన వారంత అయ్యో పాపం అనుకుంటుంటే ..ఇతడి చేత దాడి చేయించిన వారు మాత్రం అసలు పట్టించుకోకపోవడం కొసమెరుపు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.