వివేకా కేసు పూట‌కో డ్రామా..

మాజీ మంత్రి..వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య పూటకో డ్రామా అవుతుంది. ఈ హత్య ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు బాగా వాడుకుంటున్నాడు. జగన్ కుటుంబ సభ్యులే ఈ హత్య చేసి ఆ హత్య ను మాపై మోపుతున్నారని..సానుభూతి ఓట్ల కోసమే జగన్ ఈ హత్య చేసారని ప్రచారంలో చెపుతుంటే..తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం రోజుకో ట్విస్ట్ ఇస్తూ సంచలనం రేపుతోంది.

కుటుంబ సభ్యుల తగాదాలే ఈ హత్య కు కారణమని చెపుతూనే..అక్రమ సంబంధం..ఆస్తుల వ్యవహారం ఇవన్నీ వివేకా హత్య కు కారణమయ్యని అదే మీడియా చెపుతుంది. ఇప్పటికే అనుమానితులను కస్టడీలోకి తీసుకొని సిట్ అధికారులు విచారిస్తుండగా.. వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితుడు పరమేశ్వరరెడ్డి కి ఈ హత్య గురించి ఏమైనా తెలుసా..ఈ హత్య జరిగిన నాటి నుండి ఆయన…ఆయన కుటుంబ సభ్యులంతా కనిపించకుండా పోయేసరికి ఆయన ఎక్కడరనే కోణంలో పోలీసులు గాలింపు చేసే లోపే తెలుగుదేశం అనుకూల మీడియా ఆయన దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ లు చేస్తుంది. అనుమానితులను పోలీసులు విచారించే లోపే అనుకూల మీడియా ఇంటర్వ్యూ లు చేయడం వెనుక అసలు కారణాలు ఏంటి…అనేది రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు..ఇంకా వారు ఏమంటున్నారో వారి మాటల్లోనే..