వివేకానంద‌ని హ‌త్య చేసింది ఎవ‌రో తేలుతుందా..?

వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ని అతి దారుణంగా హత్య చేసారు. ప్రస్తుతం ఈ హత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. ఎన్నికల సమయంలో ఈ హత్య జరగడం ఎన్నికల వేడిని పెంచుతుంది. ఈ హత్య చేసింది ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీ నే అని చంద్రబాబు , లోకేష్ డైరెక్షన్లో జరిగిందని వైసీపీ నేతలు అంటుంటే…చంద్రబాబు మాత్రం కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన హత్య జరిగిందని..జగన్ వర్గీయులే ఈ హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సిట్ అధికారులు ఈ హత్య ఫై దర్యాప్తు చేస్తున్నారు. వివేకా కార్ డ్రైవర్..ఆయన ఇంట్లో పనిచేసే వారితో పాటు మరో ఇద్దర్ని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ హత్య వెనుక అసలు కారకులు ఇప్పట్లో బయటపడతారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఈ హత్య జరగడం ఇరు పార్టీ లు ఒకరిపై ఒకరు అనుమానాలు వ్యకతం చేస్తుండడం తో ఇప్పట్లో ఈ కేసు పరిష్కారం అవడం జరగని పని అని చెపుతున్నారు. ఈ లోపు ఇరు వర్గయుల్లో మాటల యుద్ధం పెరుగుతుందని..పరస్పరం ఒకరిపై ఒకరు దాడుల వరకు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది ఏమైనప్పటికి వివేకా హత్య అనేది దారుణమని చెపుతున్నారు. ఇంకేం అంటున్నారో వారి మాటల్లోనే వినండి.