కోట్ల క్లబ్ లో చేరిన జాతిరత్నం

‘హిట్’ పై నడిచే ఇండస్ట్రీ ఇది. ఇక్కడ ప్రతీ శుక్రువారానికి జాతకాలు మారిపోతుంటాయి. బండ్లు ఓడ‌ల‌వ్వడం, ఓడ‌లు బండ్లగా మార‌డం వెరీ కామన్. వరుసగా ఓ రెండు  హిట్లు పడితే చాలు కోట్ల పై కూర్చోవచ్చు. ఇప్పుడు నవీన్ పోలిశెట్టి కూడా ఇలానే క్లౌడ్ నైన్ లో వున్నాడు. `ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ‌`తో త‌న‌దైన ముద్ర వేసేసిన న‌వీన్‌… `జాతిర‌త్నాలు`తో న‌యా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాలో న‌వీన్ కామెడీ టైమింగ్ స్టార్ హీరోల్ని సైతం మెప్పించింది.

 ఇప్పుడు టాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాతల దృష్టి న‌వీన్ పై ప‌డిపోయింది. న‌వీన్ చేతికి వ‌స్తున్న ఆఫ‌ర్ల గురించి లెక్కేలేకుండా పోతోంది. వ‌నీన్ ఎంత కోరితే అంత పారితోషికం ఇవ్వ‌డానికి నిర్మాత‌లు రెడీ అయ్యారు. హారిక హాసిని సంస్థ న‌వీన్ కి అడ్వాన్సు ఇచ్చిన‌ట్టు టాక్‌.  న‌వీన్‌కు 5 కోట్ల పారితోషికం ఇచ్చిన‌ట్టు టాక్‌. అడ్వాన్స్ గా 2.5 కోట్లు, సినిమా పూర్త‌య్యాక మ‌రో 2.5 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింద‌ట‌. ఈ సినిమాకి ముందే యూవీలో ప‌ని చేయ‌డానికి న‌వీన్ ఓకే అన్నాడు. అనుష్క క‌థానాయిక‌గా న‌టిస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది.