సంచలన డైరెక్టర్ శంకర్ – సూపర్ స్టార్ రజనీకాంత్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం 2.ఓ. భారీ బడ్జెట్ తో రోబో సినిమాకు సీక్వెల్గా రాబోతున్న ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనే లేదు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రం నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ట్రైలర్ , మేకింగ్ , టీజర్స్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పాయి. స్మాల్ స్క్రీన్ లలో చూస్తూనే గ్రాఫిక్ మాయాజాలం ఇలా ఉంటె 70 ఎంఎం స్క్రీన్ ఫై ఇంకెలా ఉంటుందో అని మాట్లాడుకున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ ఫస్ట్ సీన్లోనే రేడియేషన్ కారణంగా అక్షయ్ కుమార్ పాత్ర చనిపోతుందట. తరువాత ఈవీల్ పరంగా మారిన అక్షయ్ రేడియేషన్కు కారణమైన సెల్ఫోన్లను మాయం చేయటం ఆ పవర్ను ఎదుర్కొనేందుకు చిట్టి (ద రోబో) రంగంలోకి దిగటమే మిగతా కథ అన్న ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త చూసి చాలామంది అవునా అని ఆశ్చర్యంలో పడిపోతున్నారు.
ఇక ఈ మూవీ లో రజనీకాంత్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీ ని నిర్మిస్తోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.