సెన్సార్ పూర్తి చేసుకున్న 2.ఓ

రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబినేషన్ నవంబర్ 29న రాబోతున్న చిత్రం 2.ఓ. వరల్డ్ వైడ్ గా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అన్ని చోట్ల విశేష స్పందన రాబట్టి సినిమా ఫై మరింత ఆసక్తి పెంచింది. తాజాగా తమిళ వెర్షన్ సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యుఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉందని , శంకర్ గ్రాఫిక్ మాయాజాలాన్ని చూసేందుకు రెండు కళ్లు చాల్లేదని , రజనీ – అక్షయ్ యాక్షన్ సన్నివేశాలు ఆదరిపోయని , చిన్న పిల్లలు సైతం సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పడం తో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తెలుగు వర్షన్ కు సంబందించిన సెన్సార్ కార్య క్రమాలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాల్లో బిజీ గా ఉంది. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం లో హీరోయిన్ గా అమీ జాక్సన్ నటించగా , హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేయడం జరిగింది.