‘అల..సరిలేరు’ ఒకేసారి ..

మాములుగా పెద్ద హీరో సినిమా సంక్రాంతి బరిలో వస్తేనే మాములుగా ఉండదు. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి..ఒకే రోజు బరిలోకి దిగితే ఇంకేమైనా ఉందా..ఇప్పుడు ఇదే 2020 జనవరి 12 న జరగబోతుంది. అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురం సినిమా..మహేష్ – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతునన్ సరిలేరు నీకెవ్వరూ..ఈ రెండు సినిమాలు జనవరి 12 న రాబోతున్నట్లు ఇరు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటించారు.

మొన్నటి వరకు సరిలేరు నీకెవ్వరూ జనవరి 12 న కాకుండా ముందుకు కానీ లేదా వెనక్కు కానీ వెళ్లబోతుందని ప్రచారం జరిగింది. ఇలా చేయడం వల్ల థియేటర్స్ సమస్య గానీ కలెక్షన్ల సమస్య గాని ఉండదని అంత భావించారు. ఇరు అభిమానులు కూడా ఇదే మంచింది అన్నట్లు మాట్లాడుకున్నారు. కానీ ఈరోజు ఇరు చిత్ర యూనిట్ రిలీజ్ డేట్స్ తో కూడిన పోస్టర్స్ రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు. మరి ఇదే ఫైనలా..లేక ఆ టైం కు ఎవరో ఒకరు డ్రాప్ అవుతారా అనేది చూడాలి.