జర్నీ తో హిట్ అందుకున్నాడు జై. జర్నీ తర్వాత వచ్చిన చేసిన సినిమాలు నిరాశ పరిచాయి. తాజాగా ‘రాజారాణి’ చిత్రంలో నయనతారకు జంటగా నటించి మళ్లీ సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు ఇప్పుడు మరో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. ఎంగేయుం ఎప్పోదుమ్ చిత్ర దర్శకుడు శరవణన్, జైల కాంబినేషన్తో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళంది. ఈ చిత్రంలో జై సరసన ఆండ్రియా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. పూర్తి రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిస్తున్న ఈ చిత్రం నగర నేపథ్యంలో సాగుతుందంటున్నారు దర్శకుడు. చిత్రంలో జై చాలా స్టరుులిష్ లుక్తో కనిపిస్తారని, ఆండ్రియాతో ప్రేమ సన్నివేశాలు చాలా ఫ్రెష్గా ఉంటాయని యూనిట్ చెబుతోంది