‘భోళా శంకర్’ మూవీకి ఏపీ ప్రభుత్వం షాక్ !


మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్‌’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భోళా శంకర్ ఈ నెల 11న విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల సినిమా యూనిట్ దరఖాస్తు చేసుకోగా, ఏపీ ప్రభుత్వం మాత్రం దీన్ని తిరస్కరించింది.

ఏపీ ప్రభుత్వంపై ఇటీవల చిరంజీవి విమర్శలు చేసిన నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై స్పందించిన ప్రభుత్వం.. టికెట్ల రేటు పెంచుకోడం కోసం చిత్ర బృందం దరఖాస్తు చేసుకుంది. కానీ ఆ దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, సరైన డాక్యుమెంట్లు జత చేయనందునే తిరస్కరించామని స్పష్టం చేసింది.