ప్రభాస్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్..

prabhas

సుజిత్ దర్శకత్వం లో ప్రభాస్ ‘సాహో’ చిత్రాన్ని నటిస్తున్న సంగతి తెల్సిందే..బాహుబలి 2 రిలీజ్ తర్వాత ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఇక అంతకంటే ముందే ఈ మూవీ ఫస్ట్ లుక్ & టీజర్ ను ఈ నెల 23 న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారట.

డైరెక్ట్ గా టీజర్ తోనే ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయాలని ‘సాహో’ టీం నిర్ణయించుకుంది. కాబట్టి అభిమానులు కొంచెం ఓపిగ్గా టీజర్ కోసం ఎదురు చూడాల్సిందే అని తెలుస్తుంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో ‘సాహో’ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా కావడం.. అందుకు తగ్గట్లే టీజర్ ను చాలా రిచ్ గా ఉండేలా చూసుకుంటున్నాడట దర్శకుడు సుజీత్.

prabhas

ఈ మూవీ జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. టీజర్లో కూడా యాక్షన్ సన్నివేశాలే చూపిస్తారని తెలుస్తుంది. ప్రభాస్ స్నేహితులైన వంశీ.. ప్రమోద్ ‘యువి క్రియేషన్స్’ బ్యానర్ ఫై నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం.. హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.