లెజెండ్’ ను చూసిన ఈసీ

balarishna
బాలయ్య లెజెండ్ మూవీని ప్రత్యేకంగా వీక్షించారు ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారులు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలయ్య టీడీపి తరపున అసెంబ్లీకి పోటీ చేస్తున్నందున, రాజకీయాలే ప్రధాన కథాంశంగా ఆయన హీరోగా తెరకెక్కిన ‘లెజెండ్’ మూవీ ప్రదర్శనని నిలిపేయాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఇటీవలే ఈసికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈనేపధ్యంలోనే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు లెజెండ్ మూవీ యూనిట్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. సినిమాలో రాజకీయంగా బాలక్రిష్ణకి కలిసొచ్చే అంశాలేమైనా వున్నాయా అనే కోణంలో అధికారులు సమీక్షిస్తున్నారు. లెజెండ్ ప్రదర్శన పై ఈ రోజు ఓ క్లారీటీ రానుంది