బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కొంత కాలంగా ట్విట్టర్ నుంచి దూరంగా ఉంటున్న కంగనా మనసు మార్చుకుంది. కంగనా తిరిగి ట్విట్టర్ లో యాక్టివ్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలుపుతున్నారు.
2021 మే నెలలో కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ బ్యాన్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెపై నిషేదం కొనసాగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనలపై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అటువంటి అభ్యంతరకర కామెంట్లు చేసిన కారణంగా కంగనా ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ చేయబడింది. దాదాపు 20 నెలల నిషేధం తర్వాత కంగనా ట్విట్టర్ అకౌంట్ రీ యాక్టివేట్ అయింది. హల్లో ఎవ్రీ వన్, ఇట్స్ నైస్ టు బీ బ్యాక్ హియర్ అంటూ కంగన ట్వీట్ చేసింది. తాజాగా తాను నటిస్తున్న సినిమాకు చెందిన విషయాలను పంచుకుంది.