బోయపాటికి మరింత కష్టం..

వినయ విధేయ రామ భారీ ప్లాప్ తర్వాత బోయపాటి శ్రీను తనకు కలిసొచ్చిన బాలయ్య బాబుతో సినిమాను మొదలుపెట్టాడు. బాలయ్య – శ్రీను కాంబో అంటే అభిమానుల్లో భారీ అంచనాలే..కానీ ఎన్టీఆర్ బయోపిక్ భారీ ప్లాప్ తర్వాత బాలయ్య రూలర్ అంటూ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫై ముందు నుండి పెద్దగా అంచనాలు లేనప్పటికీ..ఉన్న కొద్దీ అంచనాలను కూడా సినిమా అందుకోలేకపోయింది. అభిమానులు సైతం ఈ మూవీ ఫై పెదవిరుస్తున్నారు. దీంతో బోయపాటి ఫై మరింత భారం పడినట్లయింది.

ఎందుకంటే బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ వల్ల చాలామంది బయ్యర్లు నష్టపోగా..ఇప్పుడు రూలర్ సినిమాతో మరింతగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బోయపాటి సినిమాకు భారీ రేటు పెట్టేందుకు ఎవరు ముందుకు రారు ..మరోపక్క బాలయ్య క్రేజ్ సైతం బాగా తగ్గిందనే సంకేతాలు అందుతున్నాయి. ఇది కూడా బోయపాటి సినిమాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అసలే ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ..మరోపక్క బాలయ్య వరుస డిజాస్టర్లు మరి ఇన్ని కారణాలతో ఈ సినిమా ను ఎవరు కొంటారో అని ఇప్పటి నుండే మాట్లాడుకుంటున్నారు.