వర్మ పై కేసు పెట్టారు

varma
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో వుండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మల్కాజిగిరి మెట్రోపాలిటన్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలైంది. వివాదాస్పద సంచలన వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూలో హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడారని కుషాయిగూడకు చెందిన న్యాయవాది సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వర్మపై 295 ఎ సెక్షన్ పై కేసు నమోదుచేసి దర్యాప్తు నివేదిక సమర్పించాలని కుషాయిగూడ పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.