అక్కినేని మృతికి పలువురు ప్రముఖుల సంతాపం

anrనట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. అక్కినేని మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటని చంద్రబాబు అన్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి, తమిళనాడు గవర్నర్ రోశయ్య, పీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ, మంత్రులు వట్టి వసంతకుమార్, మండలి బుద్దప్రసాద్, సి.నారాయణ రెడ్డి తదితరలు అక్కినేని మృతికి సంతాపం తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు అక్కినేని సేవలు మరవలేనివని చిరంజీవి అన్నారు.