సెట్స్ పైకి గౌతమ్ – చరణ్ మూవీ ఎప్పుడు వెళ్తుందంటే..

నాని – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ జెర్సీ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫై క్రికెట్- మిడిల్ క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు నాట హిట్ టాక్ తెచ్చుకొని..మంచి కలెక్షన్లు రాబట్టింది. అందుకే ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు పోటీ పడుతున్నారు. అందులో భాగంగా బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని దిల్ రాజు , అల్లు అరవింద్ కలిసి రీమేక్ చేయబోతున్నారు.

ఈ రీమేక్ లో షాహిద్ క‌పూర్ హీరోగా నటిస్తున్నాడు. హిందీ లో కూడా గౌతమ్ నే డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ తో గౌతమ్ సినిమా చేయనున్నాడు. రీసెంట్ గా చరణ్ కు కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు. దీపావళి కి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం చరణ్ రాజమౌలి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు.