వకీల్ సాబ్ చిత్రం ఫై చిన్మయి ట్వీట్

సింగర్ చిన్మయి ఈమె గురించి చెప్పాల్సిన పనిలేదు. మీటూ ఉద్యమాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్లిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈమె వకీల్ సాబ్ చిత్రం ఫై ట్వీట్ చేసింది. `నేను సినిమాలు చాలా తక్కువగా చూస్తాను. అందులోనూ కామెడీ సినిమాలే ఎక్కువగా చూస్తుంటాను.

హింస, భావోద్వేగాలు ఎక్కువగా ఉండే సినిమాలను అయితే అస్సలు చూడలేను. నేర్కొండ పార్వాయి కూడా అలాంటి సినిమానే అనుకొని భయపడ్డాను. మొత్తం మీద ధైర్యం తెచ్చుకుని ఇటీవల చూశాను. సినిమా చాలా బాగుంది. ఒక మంచి సందేశాన్ని చాలా బాగా చెప్పారు. ఇలాంటి మంచి చిత్రాలను అజిత్ సార్ లాంటి పెద్ద స్టార్లు చేయడం సంతోషకరం. చాలా మందికి ఆ మెసేజ్ చేరుతుంది. చాలా మంది అర్థం చేసుకుంటారు. ఈ సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్‌గారు చేస్తుండడం నిజంగా సంతోషకరమైన విషయం. నేర్కొండ పార్వాయి, డియర్ కామ్రేడ్, బ్రోచేవారెవరురా లాంటి సినిమాలు చేస్తున్న దర్శకులు, రచయితలను చూసి ఎంతో గర్వపడుతున్నాను. మీ అవగాహనకు, సున్నితత్వానికి ధన్యవాదాల`ని చిన్మయి పేర్కొంది.