సైరా క్లైమాక్స్ ఫై చిత్ర యూనిట్ ఏమంటున్నారంటే..

చిరంజీవి – నయనతార జంటగా నటించిన సైరా చిత్రం అక్టోబర్ 02 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో రెండు రోజుల్లో చిత్ర ప్రమోషన్ హడావిడి పూర్తిస్థాయిలో మొదలు కాబోతుంది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో సోషల్ మీడియా లో ఈ సినిమా గురించి చర్చ విపరీతం అవుతుంది. ఎవరికీ వారే ఈ సినిమా గురించి ప్రచారం చేస్తున్నారు.

రీసెంట్ గా సైరా క్లైమాక్స్ ఇలాగే ఉంటుందా అనే చర్చ జరుగుతుంది. దేశం కోసం పోరాటం చేసిన నరసిమహారెడ్డి.. చివరకు బ్రిటిష్ వాళ్ళ చేతిలో చిక్కి బలి అవుతాడు. అయితే, సైరా క్లైమాక్స్ ను నెగెటివ్ గా కాకుండా పాజిటివ్ గా ఎమోషన్స్ తో ఎండ్ చేస్తున్నారని అంటున్నారు. క్లైమాక్స్ లో విషాదం లేకుండా ఎమోషన్స్ తో క్లోజ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ వార్తలను ఖండించారు. కొంతవరకు నిజమే అయినా చరిత్రను మార్చడం సబబు కాదు కాబట్టి మెగా టీమ్ సాహసించి నరసింహారెడ్డి వీర మరణాన్నే ముగింపుగా ఎంచుకున్నారట. ఆ సన్నివేశాలను చాలా భావోద్వేగంతో తెరకెక్కించారని, అవి ప్రేక్షకుల్ని కదిలించేలా ఉంటాయని అంటున్నారు.