పారిస్ అంటనే టూరిజానికి కేరాఫ్. కలర్ ఫుల్ లైఫ్. అనునిత్యం ప్రపంచం నలుమూలల నుంచి పారిస్ ను చూడటానికి ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉంటారు. అక్కడ సినిమా షూటింగ్స్, ఫ్యాషన్ షోస్ ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే కరోనా ఎఫెక్ట్ తో పారిస్ వెళ్లడానికి సెలబ్రేటీలు జంకుతున్నారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భయంకరమైన వైరస్ పారిస్ కూడా పాకింది.
ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ కోసం పారిస్ వెళ్లే వాళ్లు టూర్స్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా తన పారిస్ టూర్ ని రద్దు చేసుకుంది. ఒక ఫ్యాషన్ వీక్ లో పాల్గొనడానికి దీపిక పారిస్ వెళ్లాల్సి ఉందట. అయితే కరోనా అక్కడ వ్యాపిస్తున్న వార్తల నేపథ్యంలో… దీపిక ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.