‘సత్యం’ తరవాత హిట్ అనే మాటే ఎరుగడు సుమంత్. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా బాక్సాఫీసు దగ్గర తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పడు ఆశల గుర్రం ఎక్కి బాక్సాఫీసు దగ్గర దండయాత్రకు సిద్ధమయ్యాడు. ఆ చిత్రమే…” ఏమో… గుర్రం ఎగరావచ్చు “. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ నలుగురు లాంటి ప్రయోజనాత్మక చిత్రాలు తీసిన చంద్రసిద్దార్థ్ దర్శకత్వం వహిస్తున్నారు. పింకీ సావిక కథానాయిక. పూదోట సుధీర్ కుమార్ నిర్మాత. . ”పెళ్లి నేపథ్యంలో జరిగే కథ ఇది. పెళ్లి పై యువత ఎలా ఆలోచిస్తోంది? వారికి ఎలాంటి భాగస్వామి కావాలనుకొంటోంది? అనే కధాంశం తో తెరకెక్కించారు. ఈ చిత్రం పై సుమంత్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి సుమంత్ ఆశల గుర్రం ఎగురుతుందా ?లేదా?లేదా శుక్రవారం తేలనుంది.