‘అర్జున్ రెడ్డి’ తరవాత… విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయాడు. అతన్నుంచి ఓ సినిమా వస్తోందంటే… ఫోకస్ పడాల్సిందే. అలాంటి ఫోకస్ తెచ్చుకుంది గీత గోవిందం. ఈ సినిమా రష్మిక కథానాయిక. పరుశురాం దర్శకుడు. ఈ సినిమా టీజర్ను సోమవారం విడుదల చేశారు. సరదాగా రూపొందించిన ఈ టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
ఇది విడుదలైన తొమ్మిది గంటల్లోనే 20 లక్షల మంది వీక్షించడం విశేషం. ఈ సందర్భంగా కథానాయకుడు విజయ్ దేవరకొండ ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ‘ప్రజలారా.. నా మార్పు గురించి ఇంతగా ఎదురుచూస్తున్నారా.. హే భగవాన్!’ అంటూ సరదాగా ట్వీట్ చేశారు.
కాగా, ఈ సినిమా ఆడియోను జులై 29 విడుదల చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది. విజయ్ నటించిన ‘టాక్సీవాలా’ విడుదలకు సిద్ధమవుతోంది. మరోపక్క ఆయన హీరోగా ‘నోటా’ రూపుదిద్దుకుంటోంది. ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.