వైభ‌వంగా గోపీచంద్ వివాహం

gopichand wedingయాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్ ఓ ఇంటివాడ‌య్యాడు. రేష్మాతో ఆయ‌న వివాహం ఆదివారం రాత్రి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ క‌ల్యాణ వేడుక‌కు ఎన్ కన్వెన్షన్ సెంట‌ర్ వేదిక అయ్యింది. ప‌లువురు సినీ న‌టులు, రాజ‌కీయ ప్రముఖులు ఈ వివాహ వేడుక‌కు హాజ‌రై..నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వదించారు. చంద్రబాబు నాయుడు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు, రామోజీరావు, దాస‌రి నారాయ‌ణ‌రావు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప్రభాస్‌, కృష్ణంరాజు, రాజ‌మౌళి, జ‌గ‌ప‌తిబాబు, అల్లరి న‌రేష్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.