రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గోవిందుడు అందరివాడేలే. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ కథానాయిక. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్రస్తుతం విదేశాల్లో పాటల చిత్రీకరణ సాగుతోంది. అక్కడ రెండు పాటల్ని తెరకెక్కిస్తారు. తిరిగొచ్చి ఓ పాటని హైదరాబాద్లో చిత్రీకరిస్తారు. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. సెప్టెంబరు 15న గోవిందుడు అందరివాడేలే పాటల్ని విడుదల చేయనున్నారు. అక్టోబరు 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యువన్శంకర్రాజా ఈ చిత్రానికి స్వరాలు అందించారు.