పంతం కలెక్షన్ల ఫై నిర్మాత హర్షం..

గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కు పంతం రూపం లో మళ్లీ హిట్ అందుకున్నాడు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం బ్రహ్మ రధం పడుతుండడం తో ఈ చిత్ర కలెక్షన్స్ గోపీచంద్ కెరియర్ లోనే హైయెస్ట్ గా నిలుస్తున్నాయి. నూతన డైరెక్టర్ కె.చ‌క్ర‌వ‌ర్తి దర్శకత్వంలో శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె. రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

ఈ మూవీలో గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటించగా.. సంపత్ రాజ్, ముఖేశ్ రుషి, శ్రీనివాస రెడ్డి, పవిత్ర లోకేష్, సత్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. జులై 05 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ నేపథ్యం లో చిత్ర నిర్మాత తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సినిమా సుమారు 15కోట్ల గ్రాస్ ను ఖాతాలో వేసుకుందని తెలిపారు..ఈ కలెక్షన్ల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసారు. మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.