అ’ సినిమాతో అబ్బరపరిచాడు ప్రశాంత్ వర్మ. నాని నిర్మించిన ఈ సినిమా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘కల్కి’ సినిమా తెరకెక్కించాడు. అదా శర్మ, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్, నందితా శ్వేత ఇలా తారాగణం వుంది. ఈ సినిమాకు సంబంధించిన హానెస్ట్ టీజర్ను విడుదల చేశారు.
ఆకాశవాణి.. కొల్లాపూర్ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్బాబు దారుణ హత్య తర్వాత నర్సప్ప పెరుమాండ్ల వర్గీయుల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి’ టీజర్ ఓపెనింగ్ డైలాగ్ ఇది. ‘శేఖర్ బాబును ఎవరు చంపారు?’ అనే ఓ మర్డర్ చుట్టూ ఈ కధ నడిచింది. ఈ హత్య కేసుపై ఎంక్వైరీ మొదలుపెడదాం అని రాజశేఖర్ చెప్పడం, ఈ నేపథ్యంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను ఉత్కంఠగా ఈ టీజర్ లో చూపించారు.