టీమిండియా మాజీ కెప్టెన్.. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు గుప్పుమంటున్నవిషయం తెలిసిందే. దీనిపై లెజండరీ గాయని లతా మంగేష్కర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ధోనీజీ.. ఈ మధ్య నేను మీ రిటైర్మెంట్ పై చాలా వార్తలు వింటున్నాను. దయచేసి మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. దేశానికి మీలాంటి క్రీడాకారులు ఎంతో అవసరం. రిటైర్మెంట్ విషయంపై మీరు ఆలోచించకూడదని నేను వేడుకుంటున్నాను’ అని తెలిపారు.
అదేవిదంగా ప్రపంచకప్ను మరోసారి ముద్దాడాలన్న టీమిండియా కల నెరవేరలేదు. నిన్న జరిగిన సెమీస్లో కివీస్ చేతిలో భారత్ ఓటమిని చవిచూసింది. దాంతో టీమిండియా క్రికెటర్లు బాధాతప్త హృదయాలతో స్వదేశానికి వెనుదిరిగాల్సి వచ్చింది.