బాలయ్య పాట కోసం రూ.5 కోట్లు !


అఖండ, వీరసింహారెడ్డి సినిమాల విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులోని ఒక పాట కోసం మేకర్స్ ఏకంగా రూ.5 కోట్లు వెచ్చిస్తున్నారట. గణేశుడిపై ఈ గీతం సాగనుందని, ఇందుకోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒక భారీ సెట్ సిద్ధం చేశారని తెలిసింది. ఆల్రెడీ ఆ సెట్‌లో బాలయ్య, శ్రీలీలలపై ఆ పాటని చాలా గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నారని సమాచారం.

కాగా.. ఇందులో బాలయ్య, శ్రీలీల తండ్రి, కూతురుగా నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను తీసుకున్నారు. ఇకపోతే బాలయ్య వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉండటం, అనిల్ రావిపూడి కూడా ఒక్క ఓటమిని ఎదుర్కోకపోవడంతో.. వీరి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.