టచ్ లోకి వచ్చిన మహేష్ బాబు..

Mahesh-KTCకొన్ని రోజుల క్రితం వరకు మహేష్ సినిమా ప్రమోషన్ లకు దూరంగా ఉంటాడనే చెడ్డ పేరు ఉండేది..కానీ శ్రీమంతుడు చిత్రం తర్వాత మహేష్ లో చాల మార్పులు వచ్చాయి. సినిమా సూపర్ హిట్ కావడానికి కథ ఎంత ముఖ్యమో అంతే విధంగా ప్రమోషన్ కూడా అవసరమని తెలుసుకున్నాడు..

ఇప్పుడు అదే పనిలో పడ్డాడు మహేష్..తన తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’ కోసం విపరీతంగా ప్రమోషన్ స్టార్ట్ చేసాడు..దానిలో భాగంగానే ప్రముఖ జీ తెలుగు ఛానల్ ప్రసారం ఆయె ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ ప్రోగ్రాం కు మహేష్ గెస్ట్ గా వచ్చాడు..అంతే కాదు సినిమా విశేషాలతో పాటు పర్సనల్ విషయాలు తెలియజేసాడట..ఈ విషయాన్నీ స్వయంగా ఆ కార్యక్రమ నిర్వాహకుడు, యాంకర్ ప్రదీప్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసాడు. ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ మూడవ సీజన్ ను ప్రిన్స్ మహేష్ బాబుతో ప్రారంభించమని… ప్రిన్స్ తో దిగిన ఓ సెల్ఫీ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి తన సంతోషాన్ని చాటుకున్నాడు.