స్టార్ హీరోతో సినిమా చేస్తే… జాతకాలు మారిపోతాయ్ అంటుంటారు. పాపం.. కృతిసనన్ కి మాత్రం ఆ అదృష్టం కలసి రాలేదు. మహేష్బాబు సినిమా వన్ తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది కృతి. ఆ సినిమా ఆమెకు ఏ విధంగానూ కలసి రాలేదు. వన్ తరవాత ఆమె ఒక్క తెలుగు సినిమాపై కూడా సంతకాలు చేయలేదు. రామ్చరణ్, అల్లు అర్జున్ సినిమాల్లో నటిస్తోందన్న వార్తలొచ్చినా…. వాటిపై ఓ క్లారిటీ రాలేదు. ఇప్పుడు బాలీవుడ్లో ఓ సినిమా చేస్తోంది. హీరో పంటి అనే చిత్రంలో నటిస్తోంది. జాకీ ఫ్రాప్ తనయుడు టైగర్ ఫ్రాప్ హీరో. ఇందులో టైగర్తో లిప్ లాక్ చేసిందట. ఆ సీన్ వెండితెరపై రసవత్తరంగా పండుతుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. కథ ప్రకారం, పాత్రకు లోబడి ఎలా నటించడానికైనా నేను సిద్ధమే. ఇందులో నాకు ఎలాంటి అభ్యంతరాలూ లేవు. ఈ ముద్దు కూడా మురిపెంగా ఉంటుంది. అంతే తప్ప.. కావాలని పెట్టుకొంది కాదు.. అని చెప్పుకొచ్చింది కృతి.