యమదొంగ తరవాత సొంత సినిమాల్లోనే నటించాడు మోహన్ బాబు. బయటి సంస్థల నుంచి ఆఫర్లు వచ్చినా… నటించడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు మళ్లీ బయటి నిర్మాతలకు కాల్షీట్టు ఇస్తున్నారు. అది కూడా లాభసాటి వ్యవహారంగానే ఉంది. తాజాగా ఎస్.వీ. కృష్ణారెడ్డి సినిమా… యమలీల 2లో మోహన్ బాబు యముడి పాత్ర ధరించారు. ఇందుకోసం ఆయనకు భారీ పారితోషికం ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. అదెంతో తెలుసా..?? అక్షరాలా రెండున్నర కోట్లు. మోహన్ బాబుకి ఇంత పారితోషికమా..?? అసలు ఆయనకు అంత ఉందా?? అనుకొంటున్నారా? అదే మరి కృష్ణారెడ్డి మ్యాజిక్. ఇందులో హీరోగా నటిస్తున్న కె.వి. సతీష్ తో ఈ చిత్రానికి పెట్టబడి పెట్టించారు. వాళ్లు మహా సౌండ్ పార్టీ. అందుకే… నటీనటులు, సాంకేతిక నిపుణులకూ భారీ పారితోషికాలు ఇచ్చి బుక్ చేసుకొన్నారు. బ్రహ్మానందానికి సైతం కళ్లు చెదిరే పారితోషిక ముట్టజెప్పినట్టు సమాచారమ్. అలీతో తీసిన యమలీల అతి తక్కువ బడ్జెట్లో తీసిన చిత్రం. ఆ సినిమాలో మోహన్ బాబులాంటి స్టార్లు లేరు. ఎలాంటి అంచనాలూ లేవు. కానీ బాగా ఆడింది. ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న యమలీలలో మాత్రం… స్టార్లూ, భారీ బడ్జెట్లూ, లేనిపోని హంగామా. మరి ఏం జరుగుతుందో..??