నాని – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ జెర్సీ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫై క్రికెట్- మిడిల్ క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు నాట హిట్ టాక్ తెచ్చుకొని..మంచి కలెక్షన్లు రాబట్టింది. అందుకే ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు పోటీ పడుతున్నారు. అందులో భాగంగా బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని దిల్ రాజు , అల్లు అరవింద్ కలిసి రీమేక్ చేయబోతున్నారు.
ఈ రీమేక్ లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మధ్యనే అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకున్నారు. ఇప్పుడు నాని నటించిన జెర్సీ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నద్ధమయ్యాడు షాహిద్. ఇక ఈ మూవీ లో షాహిద్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఈ అమ్మడు సూపర్ 30 చిత్రంలో హృతిక్తో జోడీ కట్టగా, బత్లా హౌజ్లో జాన్ అబ్రహం సరసన నటించింది. తాజాగా షాహిద్ సరసన నటించే అవకాశం రావడంతో మృణాల్ ఆనందానికి అవధులు లేవు. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, చిత్రాన్ని 2020 ఆగష్టు 28వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.