వరుస విజయాలతో ఫుల్ స్పీడ్ లో ఉన్న ఫ్యామిలీ హీరో వెంకటేష్.. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో నారప్ప సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తమిళంలో సూపర్హిట్గా నిలిచిన అసురన్కు రీమేక్గా నారప్ప తెరకెక్కుతుండగా..ఇందులో వెంకీ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా ఈ చిత్రాన్ని లాక్ డౌన్ తరువాత థియేటర్లు తెరుచుకోగానే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత సురేష్ బాబు. తాజా సమాచారం ప్రకారం ఆగష్టు మొదటివారంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని టాక్. ప్రస్తుతం వెంకటేష్ నటించిన దృశ్యం 2 త్వరలో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై రిలీజ్ కానుంది. వెంకటేష్ నటిస్తున్న మరో సినిమా ఎఫ్3 జులై నుండి మైసూర్ లో షూటింగ్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.