సుకుమార్ బ్యానర్’లో నిఖిల్ సినిమా

దర్శకుడు సుకుమార్ తన శిష్యులని దర్శకులుగా ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ‘సుకుమార్ రైటింగ్స్ బ్యానర్’ని స్థాపించారు. ఈ బ్యానర్ లో వచ్చే సినిమాలకి కథ, స్క్రీన్ ప్లే స్వయంగా సుకుమార్ ని అందిస్తారు. దర్శకత్వం బాధ్యతలని మాత్రం తన శిష్యులకి అప్పగిస్తారు. అలా వచ్చిందే ‘కుమార్ 21ఎఫ్’.

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’ కథ కూడా సుకుమార్ కలం నుంచే వచ్చిందే. ఆయన శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సుకుమార్ రైటింగ్స్ నుంచి మరో సినిమా రాబోతుంది. నిఖిల్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. రేపే సినిమా ప్రారంభోత్సవం. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ దర్శకత్వం వహించనున్నారు. సుకుమార్ రైటింగ్స్, జీఏ2 సంయుక్తంగా నిర్మించనున్నాయి.