అమెరికాలో అభిమానులతో ఎన్టీఆర్..


సినీరంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ వేడుకలు అమెరికాలో జరగబోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు కూడా మొదలైయ్యాయి. ఇప్పటికే మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎం ఎం కీరవాణి అమెరికా పర్యటనలో ఉండగా.. తాజాగా సోమవారం నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఆస్కార్ అవార్డ్ వేడుకల కోసం అమెరికాకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడి ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కాలిఫోర్నియాలో తన అభిమానులను కలిసిన ఎన్టీఆర్ RRR ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఫ్యాన్స్ కు థాంక్స్ చెప్పారు. ఆ తరువాత ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తారక్ మాట్లాడుతూ.. ‘‘మీరు చూపిస్తున్న అభిమానానికి పదాలు కనిపెట్టలేదు. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి వంద రెట్లు అభిమానం నా గుండెల్లో ఉంది. అది నేను చూపించ‌లేక‌పోతున్నాను అన్నారు. మ‌న మ‌ధ్య ఏ ర‌క్త సంబంధం లేదు. నేనేం చేసి మీకు ద‌గ్గ‌ర‌య్యానో నాకు తెలియ‌టం లేదు. మీరంద‌రూ నా సోద‌రుల కంటే ఎక్కువ. మ‌న‌ది ర‌క్త సంబంధం కంటే గొప్ప‌దైన బంధం. శిర‌స్సు వంచి పాదాభివందనం చేస్తున్నా” అని అన్నారు. అభిమానుల ప్రేమకు రుణప‌డిపోయానని.. ఇంకో జ‌న్మంటూ ఉంటే ఈ అభిమానం కోస‌మే పుట్టాల‌ని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ కోసం నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం గం. 5:30 నిముషాలు నుంచి ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ మొదలు కానుంది. ఈ వేడుకను ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

ఎన్టీఆర్ తో జాన్వి కపూర్.. ఫిక్స్