మళ్లీ ’ఖలేజా’ కాంబినేషన్.. !!

mahesh(1)’ఖలేజా’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుంది. త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో మరో చిత్రం రానున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారమ్. మహేష్ కు అత్యంత ఇష్టమైన దర్శకుడిగా త్రివిక్రమ్ పేరు చెబుతుంటారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ’అతడు’ సూపర్ హిట్ గా నిలించింది. ఇప్పటికీ.. బుల్లితెరపై ఈ చిత్రం హవా కొనసాగుతోంది. ’అతడు’ తరవాత వీరి కాంబినేషన్ లో వచ్చిన ’ఖలేజా’ కాస్త నిరాశపరచింది. అయినా.. త్రివిక్రమ్ తో మూవీ చేయడానికి మహేష్ ఉత్సాహంగా వున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో..  ఓ చిత్రం చేస్తున్నాడు. ఇది పూర్తికాగానే మళ్లీ మహేష్ తో జతకట్టనున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారమ్. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. ఈ యేడాది చివర్లో వీరి చిత్రం వుండవచ్చు. మరీ.. ఈ మూవీలో కూడా బంగారం (అనుష్క)నే హీరోయినా.. ?