ముచ్చటగా మూడో సారి

samntah
సమంత, ప్రణీతల కాంబినేషన్ మళ్లీ రిపీటైయింది. అత్తారింటికి దారేది’, ‘రభస’ సినిమాలలో సందడి చేసిన ఈ ఇద్దరు ఇప్పుడు బన్నీ తో సందడి చేయనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ భారీ ప్రాజక్టుకు రూపకల్పన జరుగుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సరసన ఓ కథానాయికగా ప్రణీత ఎంపికైంది. ఇందులో ఇప్పటికే కథానాయికగా సమంతను తీసుకున్నారు. ఈ చిత్రంలో మరో కదానాయికకు కూడా అవకాశం వుంది. రేజీనా అనుకుంటున్నారు. చిత్రాన్ని సెప్టెంబర్ రెండో వారం నుండి సెట్స్ పైకి తీసుకువెళతారు.