ప్రభాస్-కొరటాల మైత్రీ కలిపింది

‘మిర్చి’ సినిమా దర్శకుడిగా పరిచయం అయ్యాడు కొరటాల శివ. ఆ తర్వాత టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరిగా ఎదిగాడు. ఇప్పటికే మహేష్ తో (శ్రీమంతుడు, భరత్ అను నేను) రెండు సినిమాలు, ఎన్టీఆర్ తో (జనతా గ్యారేజ్) ఓ సినిమా చేశాడు కొరటాల. మరోసారి మహేష్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్ తో సినిమా అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో కొరటాల సినిమా చేయడా ? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

అయితే కొరటాల-ప్రభాస్ లని మైత్రీ మూవీస్ కలిపిందని తెలుస్తోంది. కానీ నాగ్ అశ్విన్ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా యేడాదిన్నర సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఆగస్టు నుంచి సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే నాగ్ అశ్విన్ సినిమా ప్రారంభం కావడానికి ఏమాత్రం ఆలస్యమైనా ప్రభాస్ తో కొరటాల సినిమా ఉండనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాథాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.